ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ – “పవన్ కళ్యాణ్ గారితో ‘సుస్వాగతం’ రోజుల నుంచి మంచి సినిమా చెయ్యాలన్న కోరిక వుంది. అది ఇన్నాళ్ళకు నెరవేరింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గార్ల కాంబినేషన్ లో ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇది ఓ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ మాస్ టచ్. పవన్ కళ్యాణ్ గారి సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ సెకండాఫ్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది” అన్నారు. ‘జల్సా’ వంటి సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫొటో గ్రఫీ : ప్రసాద్ మూరెళ్ళ, ఫైట్స్ : రామ్ –లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్.