అఖిలపక్ష భేటీ యథాతథం: షిండే

ఈనెల 28న తెలంగాణ అంశంపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం యథాతథంగా జరుగుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. అఖిలపక్ష భేటీ నిర్వహణ తేదీలో మార్పు ఉండదని ఈ రోజు (సోమవారం) మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ అన్ని రాజకీయ పార్టీలు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరితే అప్పుడు ఆలోచిస్తామన్నారు. కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ ఆవరణలో షిండేను కలిశారు. అఖిలపక్ష సమావేశపు తేదీని మార్చవద్దని వారు ఈ సందర్భంగా షిండేను కోరారు.