Site icon TeluguMirchi.com

ఇక నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ !

parthasaradhiరాష్ట్రంలో ఇక నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోనికి రానుంది. ఎక్సైజ్ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. నూతన ఎక్సైజ్ పాలసీకి సీఎం అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే,  ఈ ఏడాది ప్రభుత్వానికి  మద్యం ద్వారా 10 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని… రానున్న ఏడాదిలో 12 వేల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని పార్థసారధి వివరించారు.

Exit mobile version