విడుదలకుముందే ‘ నాయక్ ‘ సంచలనం

‘చిరుత’ సినిమాతో తెరంగ్రేటం చేసిన చిరు తనయుడు చరణ్ . చేసిన మొదటి సినిమానే సూపర్ హిట్. తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ‘మగధీర’ ఏకంగా ఇండస్ట్రీ రీకార్డులను తిరగరాసింది. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆరెంజ్ ‘ ఈ  రేంజ్ లో ఆడక పోయిన ఓరేంజ్ లో ఆడింది. సంపత్ నంది తెరకెక్కించిన ‘రచ్చ’  మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్  చేసింది. అయితే చరణ్  చేసిన నాలుగు సినిమాల్లో మూడు సూపర్ డూపర్ హిట్టు సాధించాయి. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నాయక్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.  చరణ్ సినిమా అవడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ అమౌంట్ చెల్లించయినా  సినిమా కొనడానికి  ఆసక్తి చూపిస్తున్నారు. నైజాం, వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర ఏరియాల్లో చరణ్ గత సినిమాలకంటే అత్యధిక మొత్తం చెల్లించడానికి డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారని వినికిడి  పైగా నాయక్ లో చరణ్ ద్విపాత్రాభినయం చేయడం మరింత ఆసక్తిని రేపుతున్న అంశం.