నక్సల్ దాడి కేసును విచారించనున్న ఎన్ఐఏ

NAXAlఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు పారించిన రక్తపాతం కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారించనుంది. పరివర్తన్ ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తున్న కాంగ్రెస్ ముఖ్య నేతల వాహనాలను నాడు మావోయిస్టులు మందుపాతరలతో పేల్చి కాల్పులు జరిపి 28 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే, అంతమంది నేతలు మావోయిస్టుల దాడికి ఎలా బలయ్యారు? దీని వెనుక మవోయిస్టు ముఖ్యనేత కటకం సుదర్శన్ ఉన్నాడా? అన్న అనుమానాలపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది.