Site icon TeluguMirchi.com

ఢిల్లీలో నరసింహన్‌ భేటీల పర్వం

శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్ భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రితో రాష్ట్ర గవర్నర్‌ భేటి తెలంగాణపై అఖిలపక్ష సమావేశం జరగనున్న క్రమంలో ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్‌ ఈ సందర్భంగా రాష్ట్రంలోని చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితిని హోంమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. నరసింహన్ హోంమంత్రికి తెలంగాణలో శాంతి భద్రతలు, తీసుకోవాల్సిన చర్యల్ని సూచించినట్టు సమాచారం. గవర్నర్‌ ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్ తోనూ షిండేతో భేటీకి ముందు పార్లమెంట్‌ ప్రాంగణంలో సమావేశమయ్యారు. అలాగే నిన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాతో కూడా గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయిన సంగతీ తెలిసిందే!

Exit mobile version