Site icon TeluguMirchi.com

డిసెంబర్ 7 న సోలో గా వస్తున్న రోహిత్

సోలో ఇచ్చిన సాలిడ్ హిట్ తర్వాత హీరో రోహిత్ దర్శకుడు శ్రీనివాస్ తో కలిసి చేస్తున్న చిత్రం  ‘ఒక్కడినే’. రోహిత్ కు జంటగా నిత్య మీనన్ నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రాన్నిడిసెంబర్ 7 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి టీం వర్క్ తో ఈ చిత్రాన్ని అన్నివర్ఘాల ప్రేక్షకులకు నచ్చే విధంగా  రూపొందించామని, ‘పుట్టింటోళ్ళు తరిమేశారు’ అనే పాటను రీమిక్స్ చేశామనీ, ఇది చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ త్వరలో సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుందనీ, డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకి వస్తుందని తెలిపారు.అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో సోలో( ఒక్కడినే) సెంటిమెంటు క్యారీ చేసిన రోహిత్ కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలంటే  డిసెంబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.
Exit mobile version