భాయ్ మొదలయ్యింది!

డమరుకం విజయంతో జోష్ మీద వున్నారు నాగార్జున.  వెంటనే మరో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయారు.  ప్రస్తుతం  నాగ్ ‘భాయ్’ అవతారం ఎత్తుతున్నారు. నాగార్జున కధానాయకుడిగా నటించే చిత్రం భాయ్. ‘అహనా పెళ్ళంట’, ‘పూలరంగడు’ సినిమాలతో విజయాలు అందుకున్న వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. రీచా గంగోపాద్యాయ కధానాయిక. ‘భాయ్’ షూటింగ్ సోమవారం ఉదయం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిడారంబరంగా మొదలయ్యింది. ఈ కార్యక్రమానికి మీడియా ని దూరంగా ఉంచారు. తొలి సన్నివేశానికి అక్కినేని నాగార్జున క్లాప్ ఇచ్చారు. నాగార్జున స్విచ్ ఆన్ చేసారు.  జనవరిలో బ్యాంకాక్ లో ఈ సినిమా మొదలుపెడతారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.