గోపీచంద్ కు ముంబై హైకోర్టు షాక్

బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ కు ముంబయి హైకోర్టు షాక్ ఇచ్చింది. గోపీచంద్ జాతీయ కోచ్ గా ఉంటూ ప్రైవేట్ అకాడమీ ఎలా నడుపుతున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. ముంబయికి చెందిన షట్లర్ ప్రజక్తా సావంత్ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈమేరకు ప్రశ్నించింది. కోర్టు దీనిపై భారత బ్యాడ్మింటన్ సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రజక్తను తిరిగి శిక్షణలో చేర్చుకోవాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. గోపీచంద్ తనను అకాడమీలో చేర్చుకోకుండా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ప్రజక్తా సావంత్ ఆరోపణలు చేయడం, ఆమెకు గుత్తా జ్వాల మద్దతు పలికిన విషయం తెలిసిందే.