తమ్ముడి టవర్స్.. లీజుకు తీసుకున్న ముఖేష్ !

MUkesh-ambaniమొభైల్ టవర్లు వినియోగించుకునేందుకు తమ్ముడి అనిల్ అంబానీకి చెందిన ఆర్ కామ్ తో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఒప్పందం కుదిరింది. అనిల్ అంబానీకి చెందిన టెలికాం టవర్లను ముఖేష్ జీవితకాలానికి లీజుకు తీసుకున్నాడు. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు 12వేల కోట్ల రూపాయలకు పైగా చెల్లించనుంది. దీంతో అంబానీ సోదరుల వ్యాపార బంధం మరింత బలపడింది. దేశవ్యాప్తంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు 45,000 టవర్లున్నాయి. వీటిని వినియోగించుకుని తక్కువ
సమయంలోనే దేశవ్యాప్తంగా 4జి సర్వీసులు ప్రారంభించాలని ముకేశ్ వ్యూహంగా కనిపిస్తోంది.