రాష్ట్రానికి రానున్న మోడీ !

Modi-to-address-Google-Big-భాజపాఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జూలై మూడో వారంలో రాష్ట్రానికి రానున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ ప్రభావం లేదంటున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. దమ్ముంటే..  టీడీపీ నిర్వహించిన సర్వేలను బాబు బయటపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. “ఛలో అసెంబ్లీ”పై ప్రభుత్వం దమన నీతితో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కాగా, మోడీ నాయకత్వంలోనే బీజేపీ 2014 ఎన్నికలకు వెళుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.