త్వరలో సంచలన నిజాలు…!

Shankar-Rao-demandsకాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్రావు మరోమారు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలతో వెలుగులోకి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టి తన ఫోన్ సంభాషణలను టాపింగ్ చేస్తోందని శంకర్రావు ఆరోపించారు. తన సెల్‌ఫోన్‌ను ట్యాపింగ్‌ చేస్తున్నారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని చెబుతున్నారు. శంకర్రావు ఫోన్‌ ట్యాపింగ్‌ వెనుక సీఎం, డీజీల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. జూలైలో సంచలన నిజాలు బయటకు వస్తాయంటూ మరోమారు ఆసక్తిని రేకెత్తించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులే స్వయంగా రాజీనామా చేసి పార్టీకి మేలు చేయాలని పిలుపునిచ్చారు.