Site icon TeluguMirchi.com

వాడివేడిగా సాగుతున్న మంత్రివర్గ సమావేశం !

Kiran APసచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం వాడివేడిగా సాగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా డీఎల్ బర్త్ రఫ్, కళంకిత మంత్రుల పరిస్థితి గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాతుగా స్థానిక సంస్థల ఎన్నికల
సమయం దగ్గరపడుతుండటంతో.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీని వీడుతామంటున్న నేతలు, భంగారుతల్లి పథకం ఇలా అన్ని అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా, ఢిల్లీ టూర్ ను ముగించుకొని ఈ సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Exit mobile version