సొరంగమార్గంలో.. సోనియా, ప్రధాని రైలు ప్రయాణం !

sonia-manmohan-in-Tunnelఆసియాలోనే రెండవ అతిపొడవైన సొరంగ మార్గంలో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రయాణించి రికార్డు సృష్టించారు. జమ్మూలోని బనీహాల్ నుంచి కాజీగుండ్ ల మధ్య రైలును ఈరోజు ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సోనియా కూడా హాజరయ్యారు. అనంతరం వారిద్దరూ అదే రైలులోనే 18 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణించారు. ఇందులో11 కిలోమీటర్లు సొరంగ మార్గం ఉండటం విశేషం.