ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే భవిష్యత్‌ ఉండదు

కాంగ్రెస్‌ పార్టీ ఒకవేళ తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే, ప్రజాప్రతినిధులందరూ ప్రజల పక్షాన నిర్ణయం తీసుకుంటామని ఎంపీ మందా జగన్నాథం స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి తనతోపాటు తెలంగాణ ఎంపీలకు ఆహ్వానాలు వచ్చినా, తాము ఇంకా కాంగ్రెస్‌ను వీడాలన్న నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశంపై ముగింపు పలికిన రోజున, తామంతా తప్పకుండా మరో ఆలోచనను పరిశీలిస్తామని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా డిసెంబరు 28న నిర్వహించే అఖిలపక్షంలో నిర్ణయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోనియాతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే భవిష్యత్‌ ఉండదని చెప్పామని ఆయన వివరించారు.