సోనియాతో భేటీయైన మందకృష్ణ !

manda-krishnaకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సోనియాను కోరినట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేయకపోతే ఎస్సీ ఓట్లను కాంగ్రెస్ వదులుకోవాల్సిందేనని సూచించినట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ భేటీలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా పాల్గొన్నారు.