మైత్రి ఫస్ట్ కాపీ రెడీ

నవ దర్శకుడు సూర్యరాజు కథ..స్క్రీన్ ప్లే..దర్శకత్వాన ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజేష్ కుమార్ హనుసినీ క్రియేషన్స్ పతాకంపైన నిర్మించిన సస్పెన్స్ కథాచిత్రం “మైత్రి” అన్ని కార్యక్రమాల్ని ముగించుకుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ కాపీ ఈ మధ్యనే వచ్చింది. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కో – ప్రొడ్యూసర్ కుమార్ రాజా “మైత్రి” విశేషాల్ని తెలుపుతూ—“ప్రస్తుతం వస్తున్న లవ్…యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఓ కొత్త కథను తీసుకుని సస్పెన్స్ ప్రధానంగా సాగే అంశాలతో మా దర్శకుడు సూర్యరాజు ఈ చిత్రాన్ని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ సదా పాత్ర మనం ఊహించే దానిని భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని వికాస్ అందించారు. ఈ మధ్యనే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాల్ని తొందరగా పూర్తిచేసి త్వరలో సినిమాని విడుదల చేస్తాం” అన్నారు. నవదీప్ – సదా జంటగా నటించిన ఈ చిత్రంలో డా. బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శ్రీను, సుమన్ శెట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి వికాస్ సంగీతం అందించిన దీనికి ఛాయా గ్రహణం : సెల్వా; ఎడిటింగ్ : వినయ్; కళ : విజయ్ కృష్ణ; ప్రొడక్షన్ : సతీష్