నేనింతే… !

mahidhar reddy‘నేనింతే..’ ఇదేదో మాస్ మహారాజా రవితేజ సినిమా కాదండోయ్ !. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్భన్ డవలప్ మెంట్ శాఖ మంత్రి మహిధర్ రెడ్డి అన్న మాటలివీ. అలా ఎందుకన్నారంటే.. మంత్రిగారిని తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారట. అయితే, దీనిపై మంత్రి స్పందిస్తూ.. కొందరి ఎమ్మెల్యేల సొంత పనులు చేయకపోవడంతో తనను తొలగించాలని వారు సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అయినా నేనింతేనని, తన పద్దతి, విధానాలు మార్చుకోనని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు మహీంధర్ రెడ్డికి సహచర మంత్రుల నుంచి మద్దతు కూడా లబించింది. మంత్రి మహిధర్ రెడ్డి తీరు సరైనదేనని.. మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. ఆయన్ని తొలగించాలంటూ ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించడం సరికాదని నాగేందర్ అభిప్రాయపడ్డారు. మరి ఎమ్మెల్యేలు ఏమంటారో చూడాలి!