Site icon TeluguMirchi.com

ప్రిన్స్ తో చిందులు వేసేది ఎవరు..?

సుకుమార్ సినిమా అంటే… కచ్చితంగా అదిరిపోయే ఐటెం పాట ఒకటి పడిపోవలసిందే. ‘ఆ అంటే అమలాపురం’, ‘ముప్పి ఆరు’, ‘రింగా రింగా’, ‘డియాలో డియాలా’… ఈ ఘాటు మసాలా పాటలన్నీ ఆయన సినిమా లోనివే. ప్రస్తుతం సుకుమార్… మహేష్ బాబు తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనూ మత్తెక్కించే పాట  ఒకటి వుంది. ఇప్పటికే  దేవీశ్రీ ప్రసాద్… ఈ ఐటెం పాట కంపోజ్ చేసేసారు. ఇప్పటి వరకూ.. వచ్చిన ప్రత్యేక గీతాలను మరపించేలా ఆ పాట ట్యూన్ చేశారని సమాచారం. అయితే ఈ పాటకు మహేష్ తో చిందు వేయించడానికి ఎవరిని ఎంచుకోవాలో చిత్ర బృందానికి అంతు చిక్కడం లేదు. తెలుగులో పాపులర్ కధానాయికల పేర్లు పరిశీలిస్తున్నారు. ఒక దశలో తమన్నా పేరు కుడా ప్రస్తావనకు వచ్చిందంట. ఇప్పుడు సుకుమార్ దృష్టి బాలీవుడ్ వైపుకి మళ్ళింది. అక్కడి నుంచి ఓ కధానాయికను దిగుమతి చేసుకునే పనిలో పడ్డారు. “ఈ పాట చిత్రీకరించడానికి ఇంకా సమయం వుంది. ఈలోగా ఐటెం గర్ల్ ని ఎంపిక చేస్తాం” అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో…?

Exit mobile version