కేటీర్ బీజేపీతో తమకు శత్రుత్వం లేదని, వున్నదల్లా మిత్ర వైరుధ్యమేనని అన్నారు. బీజేపీయే కాదు తెలంగాణ కోసం పనిచేసే అన్ని పార్టీలు, సంస్థలు తమకు సోదరులతో సమానమని ఆయన చెప్పుకొచ్చారు. అభిప్రాయ బేధాలుంటే పరిష్కరించుకుంటామన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ రెండూ మోసం చేశాయని ఆరోపించారు. నాడు తెలంగాణకు చంద్రబాబు అడ్డు అంటున్న బీజేపీ రేపు వెంకయ్యనాయుడు అడ్డు అని అంటుందేమో అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పోరాడుతున్న జాతీయ పార్టీ బీజేపీని విమర్శిస్తే.. అసలుకే ఎసరు వస్తుందనేమో కేటీఆర్ కాస్త రూట్ మార్చి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.