కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం… అధిష్టానం

HY06KTR_GCR3SAS3K_1_856843f-285x250తెలంగాణ సాధనే లక్ష్యంగా టీ కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్న ‘తెలంగాణ సాధన సభ’ ఓ నాటకమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో సభ పెట్టడం కాదని, సోనియా ఇంటి ముందు ధర్నా నిర్వహించాలని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ సాధన సభ పేరిట ఆదివారం నిజాం కళాశాల మైదానంలో సభ ఏర్పాటు చేయడం వెనక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కాంగ్రెస్ అధిష్ఠాం పాత్ర ఉందని కేటీఆర్ మండి పడ్డారు.