Site icon TeluguMirchi.com

కావూరితో కేటీఆర్ భేటీ…!

kavuri-ktrకేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతో.. కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా..  సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ ఏర్పాటు చేయవలసిందిగా ఆయన కావూరికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే కేంద్రం కావూరికి జౌలి శాఖ మంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే, కరుడు గట్టిన సమైక్యాంధ్ర వాదిగా ముద్రపడిన కావూరితో.. తెలంగాణ ఉద్యమ అధినేత కుమారుడు కేటీఆర్ సమావేశమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Exit mobile version