Site icon TeluguMirchi.com

జంట ప్రయాణం మొదలైంది

Kotha Jantaగౌరవం చిత్రం తరువాత అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కొత్త జంట’. ఈ చిత్రం ముహూర్త కార్యక్రమాలు ఈ రోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకుంది. ముహూర్త కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, అల్లు అరవింద్ లతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శిరీష్ పై తీసిన ముహూర్తం సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చారు. అల్లు శిరీష్ సరసన రెజీనా హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని  స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Exit mobile version