Site icon TeluguMirchi.com

సర్కారే ఓ అసాంఘిక శక్తి?

Kodandaram‘చలో అసెంబ్లీ’ శాంతియుతంగా నిర్వహిస్తామని టీజేఏసీ నేత కోదండరాం తెలిపారు. భయాలను సృష్టించి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు. అసాంఘిక శక్తులను సర్కారే ప్రోత్సహించి అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందన్నఅనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని అన్నారు. పోలీసులపై సీఎం, ప్రభుత్వం నియంత్రణ కోల్పోయాయని అన్నారు. తెలంగాణ ప్రజలంతా రేపు ఇందిరాపార్కు దగ్గరకు వచ్చి, అక్కడినుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని కోదండరాం వెల్లడించారు.

Exit mobile version