బైండోవర్ కేసులకు భయపడొద్దు

Kodandaramటీజేఏసీ ఈ నెల 14న తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ విషయమై పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ… లక్షలాది మందిని హైదరాబాద్ తరలించి ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు. అణచివేత చర్యలతో ఉద్యమాన్ని అడ్డుకోవాలని యత్నిస్తే, తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై నగర పోలీసు కమిషనర్ మరోసారి ఆలోచించుకోవాలని నాయిని అన్నారు. ‘చలో అసెంబ్లీ’ వంటి కార్యక్రమాలను అనుమతించేది లేదని హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మ నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘చలో అసెంబ్లీ’ పై టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ.. జూన్ 14న జరిగే చలో అసెంబ్లీని విజయ వంతం చేస్తామని చెప్పారు.బైండోవర్ కేసులకు ఎవరు భయపడవద్దని, ప్రభుత్వం ‘చలోఅసెంబ్లీ’ని అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు.