Site icon TeluguMirchi.com

హైదరాబాద్ లో ప్రజాకోర్టు : కోదండరాం

Kodandaramతెలంగాణ రాజకీయ జేఏసీ ఈరోజు (బుధవారం) సమావేశమయింది. సమావేశం అనంతరం జేఏసీ చైర్మెన్ కోదండరాం మాట్లాడుతూ.. జులై 4,5 తేదీలలో ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఆహ్వానిస్తామని తెలిపారు. ఢిల్లీ సమావేశానికి ముందే హైదరాబాద్ లో ప్రజాకోర్టును నిర్వహిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అంశాన్ని కసరత్తు చేస్తుందని వస్తోన్న వార్తల నేపథ్యంలో.. ఢిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని కోదండరాం తెలిపారు.

Exit mobile version