Site icon TeluguMirchi.com

కేసీఆర్ తెలంగాణ వ్యక్తి కాదు : మోత్కుపల్లి

టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై విరుచుకుపడ్డారు. నరసిహావతారమే కాదు…  ఎన్ని అవతారాలు ఎత్తినా కేసీఆర్ ను ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ ఇప్పుడు తన పబ్బం గడుపుకోవడానికి వంద సీట్లు, 17 ఎంపీలు అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలే విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కారణమని ఆరోపించారు మోత్కుపల్లి. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వలస వచ్చారని, ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, ఇకనైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని మోత్కుపల్లి సూచించారు.

Exit mobile version