Site icon TeluguMirchi.com

జాడలేని జూనియర్ !

ntrపార్టీ శ్రేణులను 2014 ఎన్నికల సమరానికి సమాయత్తం చేయడంతోపాటు, వారికి దిశానిర్దేశం చేసే ప్రధాన అజెండాగా కొద్ది సేపటి క్రితం  తెలుగుదేశం మహానాడు ఆరంభమైంది. అధినేత చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, తెదేపా అత్యంత ప్రతిష్టాత్మక భావించి నిర్వహించే మహానాడులో జూ. ఎన్టీఆర్ జాడలేకపోవడంతో.. పార్టీలోని జూనియర్ అభిమానులు కొంత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, జూనియర్ షూటింగ్ ల బిజీమీద విదేశాలకు వెళ్లినట్లు కొంతమంది కార్యకర్తలు చెబుతున్నా.. మహానాడుకు రావడం ఇష్టంలేకే.. అనే వాళ్లే ఎక్కువ. ఏది ఏమైనా.. నందమూరి-నారా కుటుంబాల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు మహానాడు సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. మరోవైపు జూనియర్ తండ్రి హరికృష్ణ మహానాడు హాజరైనప్పటికినీ.. అన్యమనస్కంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మహానాడు సభవేదికపై రెండవ వరుసలో కూర్చున్న హరికృష్ణకు ఓ కార్యకర్త పార్టీ కండువాను అందించిన ఆయన తిరస్కరించినట్లు సమాచారం.

Exit mobile version