Site icon TeluguMirchi.com

నీతి, నిజాయతీ, నిబద్ధత ఉన్నవారే రండీ !

JPనీతి, నిజాయతీ, నిబద్ధత ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాదులో జేపీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల జీవన స్థితిగతుల గురించి పట్టించుకోవడమే నిజమైన రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షోభంలో కూరుకుపోతున్న రాజకీయాలను బయటకు తీసుకురావాలంటే.. ప్రజలు బయటకు రావాలని జేపీ అభిప్రాయడ్డారు. అన్ని
వర్గాల ప్రజల ప్రయోజనాలను సమన్వయం చేయడం కోసం తమ పార్టీ  కృషి చేస్తోందదని జేపీ అన్నారు. కాగా, ఓ స్వచ్చంద సంస్థ నాయకురాలు కాంతిమతి ఈరోజు జేపీ సమక్షంలో లోక్ సత్తాలో చేరారు.

Exit mobile version