‘పంచాయితీ’ కోసమే !

janareddyహస్తినలో.. జానా భేటీలు ముగిశాయి. అనంతరం జానా విలేకరులతో మాట్లాడుతూ.. పంచాయితీ ఎన్నికల నిర్వహిణకు గురించి చర్చించేందుకే ఆజాద్ తనను రమ్మన్నారని పేర్కొన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 11లోపు పంచాయతీ రిజర్వేషన్లు
పూర్తి చేస్తామన్నారు. జులై మొదటి వారంలో పంచాయతీ, ఆగస్టు చివరిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుండే అవకాశం ఉందని జానా వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందని జానా తెలిపారు.