జైహింద్ మొద‌లైంది

arjunఅర్జున్‌లో న‌టుడే కాదు, మంచి ద‌ర్శకుడు కూడా ఉన్నాడు. 1994లో జైహింద్ సినిమాతో ద‌ర్శకుడిగా త‌న స్టామినా ఏమిటో నిరూపించుకొన్నాడు. ఇంత‌కాలానికి ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారు. జైహింద్ 2 పేరుతో. అర్జున్ స్వీయ ద‌ర్శక‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ మూడు భాష‌ల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. చార్లెస్‌, సుర్లిన్ చావ్లా క‌థానాయిక‌లు. ఈ చిత్రం సోమ‌వారం సాయింత్రం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ”అబ్దుల్ క‌లామ్ మాటల స్ఫూర్తితో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఆయ‌న‌కూ, ఈ దేశంలోని పాత్రికేయుల‌కూ ఈ సినిమా అంకితం. ఓ అర్థవంత‌మైన చిత్రమిది. బాధ్యత‌తో తీస్తున్నాం. దేశ‌భ‌క్తి పెంపొందిస్తుంద‌నే న‌మ్మకం ఉంద‌”ని అర్జున్ చెప్పారు. ష‌ఫీ, బ్రహ్మానందం, ర‌ఘుబాబు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.