కోర్టులో హాజరైన జగన్, సబిత !

jagan sabithaజగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా వ్యవహారానికి సంబంధించిన ఛార్జిషీటుపై ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. ఇందులో భాగంగా చంఛల్ గూడ జైల్లో ఉన్న జగన్, విజయసాయి రెడ్డిలను జైలు అధికారులు భారీ భద్రత మధ్య కోర్టుకు తరలించారు. మరోవైపు ఈ కేసులో నాలుగవ నిందితురాలుగా ఉన్న మాజీ హోం శాఖ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. కాగా, జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి కూడా కోర్టుకు వచ్చారు.