Site icon TeluguMirchi.com

ఆరంభం అదిరింది..!

indiaవన్డే ప్రపంచ చాంపియన్ భారత్… చాంపియన్స్ ట్రోఫీని శుభారంభం చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 114  సెంచరీతో పాటుగా,  రోహిత్ శర్మ 65 పరుగులతో రాణించడంతో పాటుగా జడేజా 47 మెరుపు ఇన్నింగ్స్ తో … ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.

అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 305 పరుగులకే ఆలౌటైంది. డివిలియర్స్  70, పీటర్సన్ 68 మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించినా ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లబించింది.

Exit mobile version