327 పరుగుల వద్ద ముగిసిన ఇండియా ఇన్నింగ్స్‌

టీమిండియా ముంబై టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. 6 వికెట్లకు 266 రన్స్‌ ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్ భోజన విరామంలోపే మిగతా వికెట్లు కోల్పోయింది. మొదటి రోజు సెంచరీతో కదం తొక్కిన పుజారా135 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 68 పరుగులు చేసిన అశ్విన్‌.. పుజారాతో కలిసి ఏడో వికెట్‌కు 111 పరుగులు జోడించాడు. వీరిద్దరు చేసిన అద్భుతమైన బ్యాటింగ్‌ చలవతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో పనేసర్‌ 5 వికెట్లు, స్వాన్‌ 4 వికెట్లు తీశారు. స్పిన్‌ బౌలింగ్‌కు పిచ్‌ అనుకూలిస్తుండడంతో ఇంగ్లండ్‌కు కూడా కష్టాలు తప్పేలా లేవు.