రవితేజ నిర్మాతగా మారుతున్నాడు, స్నేహితుడు పూరి జగన్నాథ్తో ఓ సినిమా చేస్తున్నాడు..
గత కొన్ని రోజులుగా ఫిల్మ్నగర్ చుట్టూ ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై మాస్ మహారాజా ఓ క్లారిటీ ఇచ్చాడు. ”నిర్మాతగానా? నేనా? నాకు చేతకాని పనులు ఎప్పటికీ చేయను” అని చెప్పేశాడు. అయితే డైరెక్షన్ మాత్రం ఉంటుందట. అది ఎప్పుడో చెప్పలేను అంటున్నాడు. రవితేజ బలుపు ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళ్లింది. అయితే ఆ రోజు సినిమాని పూర్తిగా చూసే అవకాశం సెన్సార్ సభ్యులకు రాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల… సగమే చూశారు. సోమవారం మిగిలిన సగం చూసి ఈ సినిమాకి సర్టిఫికెట్ జారీ చేస్తారు.