Site icon TeluguMirchi.com

పార్టీని వీడేది లేదు : జానా

janareddyకాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్నేలేదని.. పార్టీలోనే ఉంటూ తెలంగాణ కోసం పోరాటం సాగిస్తానని పంచాయితీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ పార్టీ వీడి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్
ఎంపీలు వివేక్, మందా జగన్నాధం, పీసీసీ మాజీ అధ్యక్షుడు కేశవరావు, మాజీ మంత్రి వినోద్ లు పార్టీని వీడడం వల్ల కలిగే నష్టం ఎన్నికలు వస్తే గానీ తెలియదని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు అధిష్ఠానంతో తెలంగాణ ఆకాంక్షపై చర్చిస్తున్నామని తెలిపిన జానా, హోం శాఖ కోసం తాను ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హోంశాఖను నిర్వహించడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, అధిష్టానం తెలంగాణపై 2014లో గానే నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తనకుందని జానారెడ్డి తెలిపారు.

Exit mobile version