Site icon TeluguMirchi.com

హరీష్ రావు హెచ్చరిక..!

T-Harish-Raoఈ నెల 14న తెలంగాణ రాజకీయ ఐకాస తలపెట్టిన  “ఛలో అసెంబ్లీ”కి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెరాస సీనియర్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయితే, ఆందోళనకు సంబంధించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాము బాధ్యతను తీసుకుంటామని, లేకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీష్ రావు హెచ్చరించారు. గతంలో మిలియన్ మార్చ్ కు
ప్రభుత్వం అనుమతిని ఇవ్వనందునే హింస చోటుచేసుకుందని ఆయన గుర్తుచేశారు. కాగా, పోలీసులు మాత్రం కేయూ, ఓయూ చెందిన జేఏసీ నాయకులను ఇప్పటి నుంచే అదుపులోనికి తీసుకుంటున్నారని సమాచారం.

Exit mobile version