ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే అందాల పంట పండినట్టే. ఆ ఇద్దరూ గ్లామర్ తారలైతే ఆ సినిమాకి మరింత శోభ వస్తుంది. ఎవడు సినిమాలోనూ డబుల్ గ్లామర్ కనిపించనుంది. రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎవడు. ఈ సినిమాలో శ్రుతిహాసన్, అమీజాక్సన్ కథానాయికలు. శ్రుతిది లీడ్ రోల్. రెండో స్థానం.. అమీకి దక్కింది. అయితే అందాల ఆరబోత విషయంలో శ్రుతి కంటే.. అమీనే ముందుందంట. ఈ సినిమాలో శ్రుతికి అమీ గట్టి పోటీ ఇచ్చిందట. అభినయం మాటేమో గానీ, గ్లామర్ విషయంలో శ్రుతిని అమీ పక్కకు నెట్టేసిందని సమాచారం. ఇటీవల విడుదలైన ఎవడు స్టిల్స్లో అమీ చిట్టి పొట్టి దుస్తులతో రెచ్చగొట్టేస్తోంది. అంతేకాదు ఓ పాటలో బికినీలోనూ కనిపిస్తుందట. శ్రుతి కూడా తక్కువ తినలేదు. బలుపు సినిమాలో తన గ్లామర్తో అందరినీ కట్టిపడేసింది. ఎవడులోనూ అదే స్థాయిలో కనిపిస్తుందట. మరి.. ఈ కథానాయికల పోటీలో ఎవరు గెలుస్తారో ప్రేక్షకులే చెప్పాలి.