ఆఖరి పోరాటం..!

ponnala-laxmaiahతెలంగాణ సాధనలో ఇదే ఆఖరిపోరాటమని ఐటీ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు.      మెదక్ లో పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల పోరాటం తుది దశకు చేరుకుందని అన్నారు. ఈ నెల 30వ తేదిన తలపెట్టిన తెలంగాణ సాధన సభతో.. అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలోనే ఫలిస్తుందని పొన్నాల అన్నారు.