టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరసింహరాజు మృతి

breakingnewsతెదేపా మాజీ ఎమ్మెల్యే పీవీ నరసింహరాజు మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కోవాడ అన్నవరంలోని తన స్వగృహంలో ఆయన ఈరోజు (మంగళవారం) గుండెపోటుతో కన్నుమూశారు. భీమవరం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పీవీ నరసింహరాజు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబునాయుడుతోపాటు పలువురు పార్టీ నేతలు సంతాపం తెలిపారు.