ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…”మా బేనర్ లో ఇది 32వ చిత్రం. మూడు సార్లు జాతీయ అవార్డు పొందిన చిత్రాలు రూపొందించిన చేరన్ తో పనిచేయడం సంతోషంగా ఉంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. వేసవి చివరలో రిలీజ్ చేయడానికి ప్రయతిస్తాం” అని తెలిపారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ “చేరన్తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. నిత్య వంటి గొప్ప నటితో చేయడం సంతోషంగా ఉంది” అన్నారు. తన జీవితంలో ఓ యువకుడు ఎదుర్కొన్న నాటకీయ సంఘటనలే ఈ సినిమా అనీ నిత్య తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి. ప్రకాశ్కుమార్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్, కూర్పు: రామారావు, కళ: సెల్వకుమార్.