Site icon TeluguMirchi.com

‘ఏమిటో ఈ మాయ’ అంటున్న నిత్యా మీనన్

శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై శర్వానంద్, నిత్యా మీనన్ నాయకా నాయికలుగా ‘ఏమిటో ఈ మాయ’ అనే సినిమా రూపొందుతోంది. రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చేరన్ దర్శకుడు. కృష్ణచైతన్య సమర్పిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో ఆదివారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి హీరో రామ్ క్లాప్ నివ్వగా, నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో ఈ చిత్రం తయారవుతున్నదని రవికిశోర్ తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…”మా బేనర్ లో ఇది 32వ చిత్రం. మూడు సార్లు జాతీయ అవార్డు పొందిన చిత్రాలు రూపొందించిన చేరన్ తో పనిచేయడం సంతోషంగా ఉంది. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. వేసవి చివరలో రిలీజ్ చేయడానికి ప్రయతిస్తాం” అని తెలిపారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ “చేరన్తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. నిత్య వంటి గొప్ప నటితో చేయడం సంతోషంగా ఉంది” అన్నారు. తన జీవితంలో ఓ యువకుడు ఎదుర్కొన్న నాటకీయ సంఘటనలే ఈ సినిమా అనీ నిత్య తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి. ప్రకాశ్కుమార్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్, కూర్పు: రామారావు, కళ: సెల్వకుమార్.

Exit mobile version