Site icon TeluguMirchi.com

జగన్ కు ‘ఈడీ’ మరో దెబ్బ !

Jagan bail rejected againఅక్రమాస్తుల కేసులో.. జగన్ పై ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) మరోసారి కొరడాఝులిపించింది. ఈ కేసుతో సంబంధం వున్న రాంకీ ఫార్మా సిటీకి చెందిన 143.74 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంట్లో.. రూ.10 కోట్లను జగతి పబ్లికేషన్స్ లో రాంకీ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. ప్రతిఫలంగా గ్రీన్ బెల్ట్ తగ్గింపు ద్వారా రాంకీ మొత్తం 914 ఎకరాలు లబ్ది పొందింది. ఈరోజు దీనిపై తీర్పు వెలువరించిన ఈడీ ప్రాధికార సంస్థ.. రాంకీ ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం సరైనదేనని పేర్కొంది. కాగా,  జనవరి 7న ఈడీ జగన్ కేసులో రాంకీ ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version