డిఎస్సీ-2012 అభ్యర్థుల ఆందోళన !

dsc Candidates worryనూతన విధానం ద్వారా నష్టపోయిన తమకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. డీఎస్సీ-2012 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దాదాపు 100 మందికిపైగా అభ్యర్థులు మాసాబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం పైకి ఎక్కి ఆందోళనకు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే.. భవనం పై నుండి దూకుతామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే, అభ్యర్థుల ఆందోళనపై అదనపు డీసీపీ నాగరాజు స్పందిస్తూ.. సంబంధిత మంత్రి స్థానికంగా అందుబాటులో లేరని.. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై రేపు కేబినేట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి తెలిపారని వెల్లడించినట్లు తెలుస్తోంది.