Site icon TeluguMirchi.com

త్వరలోనే ఓ నిర్ణయం

Digvijay_Singhరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తనదైనశైలిలో పని మొదలుపెట్టారు. ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర పరిస్థితులపై తీవ్రంగా ఆలోచిస్తుందని, తెలంగాణ అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని, ఏ నిర్ణయానికైనా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. అన్ని ఆలోచించే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మరో వారం పది రోజుల్లో తెలంగాణ అంశంపై కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఉంటుందని తెలిపారు.

ఈ ప్రత్యేక సమావేశానికి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను ఆహ్వానించనున్నామని, ఈ ప్రత్యేక భేటీలో రాహుల్ కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఇంకా ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయాలని, జిల్లా సమన్వయ కర్తలుగా ఉన్నవారు ప్రతినెలా జిల్లాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని కోరారు.

Exit mobile version