ఒరిజినల్ సీడీ సమర్పించాకే జ్యుడిషియల్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేస్తామని ధర్మాన, సబిత మెమోలో కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై విచారణను కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ధర్మాన, సబిత జ్యుడిషియల్ కస్టడీపై తదుపరి విచారణ 25కు వాయిదా పడింది.
రాజీనామా లేఖలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వీడియో అస్పష్టంగా వుందని, ఆ వీడియో ఎడిట్ చేసి ఉండకూడదని ఈ మాజీ మంత్రులు అంటున్నారు. అయితే ఈ వాదన పై సీబీఐ స్పందిస్తూ.. తాము ఆ వీడియోను యూట్యూబ్ నుంచి సేకరించామని కోర్టుకు తెలిపింది.