Site icon TeluguMirchi.com

ధర్మాన, సబితల రాజీనామా ఆమోదం

dhramana sabithaమంత్రుల రాజీనామాలకు సంబంధించి గత కొద్దికాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ధర్మాన ప్రసాదరావు, సబితాఇంద్రారెడ్డిల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఈ రోజు ఆమోదించారు. ఎలాంటి హడావిడి లేకుండ ఈ ప్రక్రియ జరిగిపోయింది. జగన్‌ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరు గతవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక గవర్నర్‌ నరసింహన్‌ వీరి రాజీనామాలను ఆమోదించడం తో రాష్ట్ర రాజకీయాలు మరో సారి వేడెక్కాయి.

Exit mobile version