ధర్మాన, సబితల రాజీనామా ఆమోదం

dhramana sabithaమంత్రుల రాజీనామాలకు సంబంధించి గత కొద్దికాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ధర్మాన ప్రసాదరావు, సబితాఇంద్రారెడ్డిల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఈ రోజు ఆమోదించారు. ఎలాంటి హడావిడి లేకుండ ఈ ప్రక్రియ జరిగిపోయింది. జగన్‌ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరు గతవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక గవర్నర్‌ నరసింహన్‌ వీరి రాజీనామాలను ఆమోదించడం తో రాష్ట్ర రాజకీయాలు మరో సారి వేడెక్కాయి.