Site icon TeluguMirchi.com

నాకు అనుకూలంగా జరిగితేనే….

dharmanaమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని తనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతినివ్వొద్దని కోరారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈమేరకు ధర్మాన లేఖ రాసినట్టు సమాచారం. ధర్మాన సీఎంకు రాసిన లేఖలో వాన్‌పిక్ వ్యవహారంలో తాను కేబినెట్ నిర్ణయాలనే అమలు చేశానని పేర్కొన్నారు.తనకు అనుకూలంగా ఇవాళ్టి మంత్రి వర్గ సమావేశం జరిగితేనే తాను ఇకపై విధులకు హాజరవుతానని లేఖలో తెలిపారు. ధర్మాన లేఖ రాష్ట్రకేబినెట్ ఇవాళ సాయంత్రం సమావేశం కానున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ధర్మాన తన మంత్రి పదవికి వాన్‌పిక్ కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేసిన సంగతి, సీఎం ధర్మాన రాజీనామాను ఆమోదించకుండా తన వద్దే ఉంచుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version