రూల‌ర్ ట్యూన‌ర్‌… దేవీశ్రీ‌..?

balakeishna devisri prasadబాల‌కృష్ణ‌-బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. సింహా త‌ర‌వాత వీరిద్దరి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా ఇది. ఈ క్రేజీ క‌ల‌యిక‌కు మ‌రింత హంగు ఇవ్వాల‌ని చిత్ర బృందం భావిస్తోంది. అందుకే రూల‌ర్‌కి ట్యూన్స్ అందించే బాధ్యత‌.. దేవిశ్రీ ప్రసాద్‌కి అప్పగించిన‌ట్టు స‌మాచారమ్‌. ఇప్పటి వ‌ర‌కూ బాల‌య్య సినిమాకి దేవిశ్రీ ప‌నిచేయ‌లేదు. అందుకే డీఎస్‌పీ కూడా…ఈ సినిమా ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడ‌ట‌. జూన్ 15న గానీ, 17న గానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ లోగా క‌థానాయిక‌ల పేర్లు ప్రక‌టించే అవ‌కాశ ఉంది.