కాంగ్రెస్‌ దళిత వ్యతిరేకి: మోత్కుపల్లి

mothukupalliకాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల మనోవేదనలను కాంగ్రెస్ అర్థం చేసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం అంటరానితనం ఉంటుందనీ, కాంగ్రెస్ పార్టీ దళితవ్యతిరేకి కాబట్టే ప్రాంతీయ పార్టీలు పుట్టుకోచ్చాయని మోత్కుపల్లి విమర్శించారు. సముద్రాన్ని ఎండగట్టి చెంబుతో నీళ్లిచ్చినట్లు ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. ఈరోజు ఆయన శాసన సభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పై జరిగిన చర్చలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మంత్రి గీతారెడ్డిపై వ్యాఖ్యలను సంబంధించి సీఎం ఎందుకు ఖండించలేదుని ఈ సందర్భంగా మోత్కుపల్లి ప్రశ్నించారు.